ఇది ముమ్మాటికి YCP విజయం.

#ఇది_ముమ్మాటికి_YCP_విజయం.

గత కొద్ది సంవత్సరాలుగా ఉద్దానం ప్రాంతానికి చెందిన ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ.. ఎంతోమంది మరణించారు దీనిపై స్పందిస్తూ YSRCP అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు MAY 20th 2017 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం జగతి గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి వారి కష్టాలను అడిగి తెలుసుకుని వారిని ఓదార్చి YSRCP పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ,ఆరోగ్య శ్రీ పధకం క్రింద ఉచితంగా వైద్య సేవలు అందింస్తామని,ప్రతీ PHC కేంద్రంలో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని,ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని,ప్రతి కిడ్నీ వ్యాధి గ్రస్తునికి రూ 5000 నుండి 10000 వరకు పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
  ఈ హామీలకు జగన్మోహన్ రెడ్డి గారికి లభించింన ఆదరణకు జీర్ణించుకోలేక అధికారంలోకి వచ్చిన 3 సం.రాలు అయినా ఏనాడూ కిడ్నీ వ్యాధిగ్రస్తులను పట్టుకొని ప్రభుత్వం హుటాహుటిన డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ 2500 పింఛను అందజేస్తామని ప్రకటించడం జరిగింది.
    ఈ హామీ డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏమాత్రమూ సరిపోదని,దీనిని ఖండిస్తూ పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మం.ఉద్దానం రామకృష్ణపురం,మందస మం.రట్టి గ్రామంలోనూ అలాగే పలాస మం.బొడ్డపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో బహిరంగ సభలు నిర్వహించి వారిని చైతన్యపరిచి..ఇలాంటి మోసపూరిత హామీలు నమ్మవద్దని ఈ ప్రభుత్వానికి కిడ్నీ వ్యాధిగ్రస్తులపై చిత్తశుద్ది ఉంటే క్రింది హామీలు వెంటనే అమలు చేయాలని ఆరోజే డిమాండ్ చేశాము.
1. కిడ్నీ వ్యాధి బాధితులందరికీ ప్రత్యేక పించను విధానం.

2.కిడ్నీ వ్యాధి బాధితులందరికీ ఆరోగ్య శ్రీ క్రింద ఉచిత వైద్యం మరియు మందుల పంపిణీ.

3.కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వారికి ప్రభుత్వ పరిహారం.

4.ఇంటి యజమాని మరణిస్తే కుటుంబానికి పింఛను.

5.ఉద్దానం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ సెంటర్.

6.అందరికి శుద్ద జలం(mineral water ) ఉచిత సరఫరా.

   ఇప్పుడు చెప్పండి తమ్ముళ్లు ఇది ఎవరి విజయం.

Comments