పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు గత 3 నెలలుగా బురద నీటిని కొలయిల ద్వారా అందిస్తున్నారు.దీని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ,విష జ్వరాలు పాలిట పడుతున్నారు.విషయం పలాస నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్. సీదిరి అప్పలరాజు(రాజన్న ) గారు దృష్టికి వచ్చిన వెంటనే ఈ రోజు బాధితులు, మరియు వైఎస్సార్ పార్టీ నాయకులను వెంట వేసుకొని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి, ఆ మురుగు నీటిని కమిషనర్ మరియు నీటి విభాగం ఇంజనీర్ ఎదుట ప్రదర్శించి వారిని నిలదీయడం జరిగింది. వెంటనే సమస్య పరిస్కారనికి తగు చెర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి, వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో పట్టాన కన్వీనర్ దువ్వాడ శ్రీకాంత్, పట్టాన అధికార ప్రతినిధి బల్ల గిరిబాబు, పార్టీ నాయకులు డబ్బీరు భవానీ శంకర్, దున్న సత్యం, బదకల పులిరాజు, అంబటి ఆనంద్, బోనెల రాము, కంబల ఆనంద్, సన్యాసి ఆప్టో, సానా ఆనంద్, రామారావు, వైకుంఠ రావు, బిరాటి వల్లభ, రాజారావు, తదితరులతో పాటు రాజన్న యువసేన సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.
Comments
Post a Comment