వంశధార కాలువ కోతకు గురైన ప్రాంతాల పర్యటన.

పలాస నియోజకవర్గం, వజ్రపుకొత్తూరు మండలం సీతాపురం బొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామంలో 60RL వంశధార కాలువ కోతకు గురై సుమారు 10 ఎకరాల పొలాలలో చేతికి అందవలసిన పంట నాశనం అయ్యి పొలాలలో ఇసుక మేటలు వెయ్యడం జరిగింది.  విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్. సీదిరి అప్పలరాజు గారు (రాజన్న ) ఆ ప్రాంతానికి చేరుకొని రైతులతో మాట్లాడి MRO గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిస్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరాడ భాస్కరరావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కొర్రాయి గిరిబాబు, స్థానిక సర్పంచ్ ఉప్పాడ ఆనందరావు, గండేటి జోగరావు, బద్రి కృష్ణారావు, ,చింత నూకయ్య, కీలు శ్రీనివాస్, రైతులు పుచ్చ ధర్మారావు, గోరకల నారాయణ,పుచ్చ కూర్మరావు, కొయిల రాజులమ్మ, పుచ్చ బాలరాజు, ఇరోతు ప్రకాష్, గోరకల నూకమ్మ పుచ్చ చలపతిరావు, పుచ్చ తవిటయ్య తదితరులు పాల్గొన్నారు

Comments