అయ్యా..! రేపు మన జిల్లాకి నేతలొస్తున్నారు! అందరం పప్పన్నం వండుకొని పండగ చేసుకుందాం రండీ!!

అయ్యా రేపు మన జిల్లాకి నేతలొస్తున్నారు! అందరం పప్పన్నం వండుకొని పండగ చేసుకుందాం రండీ!!

  రాజన్న యువసేన సభ్యుడిగా నేను మన నియోజకవర్గ ప్రజాప్రతినిదులను, మన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా...!!..
ఉద్దానం అంటే ఎందుకు అంత చులకనా??
    కిడ్నీ రోగాలతో మరణిస్తున్నవారి కుటుంబాల ఆర్తనాధాలు మీకు వినిపించడం లేదా??
    ఈ ఉద్దానం ప్రజల ప్రాణాలు విలువైనవి కావా??
రాజకీయ లబ్ది కోసం తప్పించి వీరు ఎందుకూ పనికిరారనా??

అధికారంలో ఉంటే సరిపోతుందా? మా ప్రాంతపు ప్రజల కన్నీటి కష్షాలు కనిపించడం లేదా?
   ఈ ప్రాతపు అధికార పార్టీ నాయకులు ఏంచేస్తున్నారు?
   వారానికి ఒకరు ఈ మాయదారి జబ్బుకి బలౌతున్నారు..మీరు ఏమీ చేయలేరా?? మీకు చేతకాకపోతే చెప్పండి ఊరూరా భిక్షాటన చేసి,స్వచ్ఛంద సంస్థలు కాలు పట్టి మా ప్రాంత ప్రజలను కాపాడుకుంటాము.

  ఇక ఊరుకునేది లేదు..ఉపేక్షించేది లేదు.

  అదికారం ఉంటే సరిపోదు సార్..ప్రజలకోసం పని చేయాలి.

చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ ప్రాత అధికార పార్టీ నాయకులకు అడుతున్నాం చెప్పండీ..మీరు ఎంతమంది కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకున్నారు?? మీరు చెప్పండీ ఏంత మంది వ్యాధి గ్రస్తులకు మనోదైర్యాన్ని ఇచ్చారు??

గత 10 సంవత్సరాలలో సుమారు 5000 మంది Renal failure,Cronic kidney disease (CKD) జబ్బులతో మరణించారు.
సుమారు 35000 మంది Renal failures తో Stage 3, 4 &5 లతో చావుకి దగ్గరగా ఉన్న పరిస్థితి.ఈ తరుణంలో మీరు ఏమీ చేస్తున్నారు.?
  మా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారు 2004 సం.లో Dr Ravi Kumar (ప్రస్తుత V.C- NTR Health University and Science) ఆధ్వర్యంలో  మొదటి సారిగా Hardvard Medical University వారిని కలసి మన ప్రాంతంలో వివిద పరిశోధన సంస్థల పరిశోధనలలో ఈ జబ్బుకి వీరు' త్రాగే నీరే 'కారణంగా గుర్తించడం జరిగింది.ఆ సమయం ఆరోగ్య శ్రీ ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను ఆదుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేసె సమయంలో ఆ మహా నేత మనకు దూరమైన సంగతి తెలిసిందే.

     మరలా కథ మొదటికి వచ్చింది..మరలా 2011సం.లో కొన్ని పరిశోధనా సంస్థలు ఈ ప్రాంతంలో నీటిలో Mercury(పాదరసం) ఉందని..ఈ నీటిని తాగిన వారికే ఇటువంటి జబ్బులు వస్తాయని వివరించారు.

మరలా 2016 సం.లో ICRM,Hardvard University,Andhra Medical College,BARC& NTR University Health Science కలిసి ఈ ప్రాంతంలో పనిచేసి ఇక్కడ నీటిలో Silica(Si) అధికంగా ఉంది అని వివరించారు.కానీ వారి పరిశోధనా పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేసారు దీనికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు నుండి సకాలంలో రావలసిన నిధులు (Fund)రాకపోవడంతో..ఇక కధ ముగిసేలోగ..2017 July 29 మరలా Hardvard University ప్రతినిధి Dr.Joseph Bonventre అధ్యక్షతన మన ప్రాంతంలో బోరువంక గ్రామంలో పర్యటించి మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో హంగామా జరిగింది చివరకి తేలింది ఏమిటి? ?నీటి కాలుష్యం.
   దీనిని బట్టి చూస్తే 2004 లోనే మన మహా నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారు మొదటి సారిగా ఈ ప్రాంతంలో Study చేయించినపుడే తేలింది..మనకు స్వచ్ఛమైన శుద్ధ జలము కావాలని.
    మరి మన బాబు గారు ఏమి చేసారో తెలుసా NTR జలసిరి పేరుతో బోరుబావుల తవ్వించారు,పరిశోధనలు పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకన్నారు.ప్రజల సోమ్ముని వృధా చేస్తున్నాడు.
   చందువుకున్న చిన్నపిల్లవాడికి తెలుసు కలుషితమైన భూగర్భ జలాలు బోరుబావుల ద్వారా వచ్చినా మంచివి కావు అని.
ఇప్పుడు చెప్పండి మిత్రులారా.. ఉద్దానానికి శుద్ధ జలమం అందిస్తామని ఈ నెల 11వ తేదిన మన జిల్లాకి వస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ని మనం నమ్మాలా??
  #చేతులు_కాల్చి...#ఆకులు_పట్టుకోమంటారా?? మన ఉద్దానం ప్రజలు ఆనందంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రింది సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి.

1.వ్యధి గ్రస్తులకి పూర్తి ఆరోగ్యంగా భద్రత & ఆరోగ్య భీమ.
2.ప్రతీ నేల మినిమం రూ.5000 పింఛను.
3.పూర్తి స్థాయి ఉచిత వైద్యం.
4.ప్రతీ గ్రామంలో 2 నండి 4 శుద్ధ జల కేంద్రాలు.
5.డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు.
6.ఉచిత వైద్య శిబిరాలు మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు.
7.వ్యాది గ్రస్తులకు తుల్యమైన పౌష్టకాహారం.
  ఇవి తక్షణమే అమలు చేస్తారా??ఇవి చేయండి సార్ మేము మిమ్మల్ని నమ్ముతాం.

Comments